Thursday, March 28, 2024

పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యులా?: నారా లోకేష్

కొంతమంది పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని అన్నారు. జగన్ రెడ్డి కోసం ఇంకెంత మంది ముస్లిం మైనారిటీలను బలిగొంటారని ప్రశ్నించారు. సీఎం జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి.. అక్బర్ బాషా భూమి కబ్జా చేస్తే.. బాషాని సీఐ ఎన్ కౌంటర్ చేస్తామనడం… కుటుంబమంతా సామూహిక ఆత్మహత్యాయత్నం చేస్తే కిడ్నాప్ చేయడం.. పోలీసుల విధులా? అని నిలదీశారు. అక్బర్ బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని నమ్మించిన జగన్ రెడ్డి బృందం.. ‘దిక్కున్నచోట చెప్పుకో.. నీ భూమి ఇచ్చేది లేదని తేల్చేయడంతో బాషా కుటుంబంతో సహా మళ్లీ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని’ అన్నారు. అక్బర్ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడినా సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం బంధువుల కబ్జాలకు అండగా నిలిచి మైనారిటీ కుటుంబానికి అన్యాయం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపాల్ రెడ్డి ఆక్రమించిన అక్బర్ బాషా భూమిని అప్పగించే బాధ్యత జగన్ రెడ్డి తీసుకోవాలని, బాషా కుటుంబం త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement