Wednesday, April 24, 2024

ఇంకెంతమంది టీడీపీ కార్యకర్తల్ని బలితీసుకుంటారు ? : జగన్ పై లోకేష్ నిప్పులు

సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో ఓ  టీడీపీ కార్య‌క‌ర్తను హ‌త్య చేశార‌ని మండిపడ్డారు. ‘ప్ర‌శాంత‌ ప‌ల్లెల్ని కూడా ముఠాక‌క్ష‌ల కేంద్రాల్ని చేసిన ఫ్యాక్ష‌న్ సీఎం జ‌గ‌న్  గారూ! మీ క‌క్ష‌పూరిత పాల‌న‌లో ఇంకెంత‌మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల్ని బ‌లితీసుకుంటారు? ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్య‌క‌ర్త లక్కెపోగు సుబ్బారావుని వైసీపీ మూక‌లు హ‌త్య‌చేయ‌డం అత్యంత దారుణం. ఇంట్లో శుభ‌కార్యానికి డీజే పెట్టుకుంటే, ఓర్వ‌లేని వైసీపీ వ‌ర్గీయులు దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారంటే, ఎంత‌గా బ‌రితెగించారో అర్థం అవుతోంది. సుబ్బారావు కుటుంబానికి, గాయ‌ప‌డిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ అన్నివిధాలుగా అండ‌గా నిలుస్తుంది’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement