Thursday, April 18, 2024

క‌న్నుప‌డితే క‌బ్జా..జేసీబీల‌తో విధ్వంసం: నారా లోకేశ్

విశాఖపట్టణం అనధికారికంగా విజయసాయిరెడ్డి పట్టణం అయిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్ను పడితే కబ్జా, ఖాళీ చేయకపోతే జేసీబీలతో విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పెదవాల్తేరులో హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాలను ఏ2 రెడ్డి గ్యాంగులు కబడ్డీ పేరుతో కబ్జా చేయాలని చూశారని లోకేష్ ఆరోపించారు.. కబ్జా సాధ్యం కాకపోయే సరికి రాజారెడ్డి రాజ్యాంగానికి అనువైన శనివారం రోజే జేసీబీలతో కూల్చివేశారని లోకేశ్ దుయ్యబట్టారు. మానసిక దివ్యాంగులకు నీడనిచ్చే పాఠశాలకు సాయం చేయాల్సింది పోయి, ఆక్రమించిన వైసీపీ నాయకుల పాపాలు పండే రోజు దగ్గరికొచ్చిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

విశాఖ‌ప‌ట్నం ప‌రిపాల‌నా రాజ‌ధాని అవుతుందో లేదో కానీ, వైసీపీ మార్క్‌ పులివెందుల పోలీసింగ్‌తో అరాచ‌కాల‌కు అడ్డాగా మారింది విమర్శించారు. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్ గా ప‌నిచేస్తోన్న ల‌క్ష్మీప్ర‌స‌న్న అనే యువ‌తి అపోలో ఆస్ప‌త్రిలో విధులు ముగించుకుని వెళుతున్న యువతిపై పోలీసులు దాడి చేయ‌డం సిగ్గుచేటని దుయ్యబట్టారు. న‌డిరోడ్డుపై అంతా చూస్తుండ‌గానే ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్ పై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుప‌డ‌టం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జగన్ రెడ్డి అరాచ‌క‌ పాలనకు నిద‌ర్శ‌నమని ఫైర్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement