Thursday, April 18, 2024

Nara lokesh: పరీక్షలపై హెల్త్ యూనివర్సిటీ మొండి పట్టు

కరోనా థర్డ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేశాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అయితే, ఏపీలో పరీక్షలను నిర్వహిస్తామని హెల్త్ యూనివర్సిటీ మొండి పట్టు పడుతోందని, ఇది మంచిది కాదని చెప్పారు. పరీక్షలు రాయాల్సిన 3 వేల మంది విద్యార్థుల్లో సుమారుగా 600 మంది కరోనా బారిన పడ్డారని తెలిపారు. వైద్య విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఈ నెల 28 నుంచి నిర్వహించ తలపెట్టిన ఎంబీబీఎస్ మొదటి ఏడాది పరీక్షలు, ఫిబ్రవరి 1 నుండి నిర్వహించాలనుకుంటున్న రెండవ ఏడాది పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తక్షణమే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాలని నారా లోకేశ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement