టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్, కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా విజయవాడ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. లోకేష్తో పాటు కొల్లు రవీంద్ర కోర్టుకు హాజరయ్యారు. కోర్టు దగ్గర నేతలు అనుసరిస్తున్న విధానాన్ని పోలీసులు తప్పుబట్టారు. కోర్టు దగ్గర టాస్క్ఫోర్స్ పోలీసులకు ఏం పనంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. కోర్టు దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Breaking: మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన నారా లోకేష్
Advertisement
తాజా వార్తలు
Advertisement