Thursday, April 25, 2024

చంద్ర‌బాబుకు అవ‌మానంపై నందికొట్కూరు టీడీపీ నేతల నిరసనలు

నందికొట్కూరు : అసెంబ్లీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అవమానించేలా ప్రవర్తించిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు అందరూ కలిసి నందికొట్కూరు పట్టణంలో నిరసన తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు. పటేల్ సెంటర్ లో అరగంట పాటు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు విలేకరులతో మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అసెంబ్లీ లో వైకాపా ఎమ్మెల్యే లు అందరూ కలిసి అవమానించారని, ఇది ఎంత వరకు సమంజసమన్నారు.

వైకాపా ఎమ్మెల్యేలంద‌రూ నారా చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, జయసూర్య, పలుచాని మహేశ్వర రెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, భాస్కర్ రెడ్డి, మహేష్ నాయుడు, గిరీశ్వర్ రెడ్డి, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement