Tuesday, March 26, 2024

దెబ్బ తిన్న రోడ్ల దుష్ఫలితం… ఊడిపోయిన బస్సు చక్రాలు

ఏపీలో గతుకుల రోడ్ల పరిస్థితి వర్షాకాలంలో మరింతగా దారుణంగా తయారైయ్యాయని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తికరమైన ఫొటోలు ట్వీట్ చేశౄరు. ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిన స్థితిలో రోడ్డుపై నిలిచిపోయి ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు.

దెబ్బతిన్న రోడ్ల దుష్ఫలితం అని బస్సు పరిస్థితిపై నాదెండ్ల అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళ్లే బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయని వెల్లడించారు. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి అంటూ ఫొటోలు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement