Thursday, April 25, 2024

కుట్రతోనే నా సినిమాను అడ్డుకున్నారు…. రాజ‌శేఖ‌ర్

కుట్ర ప్ర‌కారంగా త‌న సినిమాను అడ్డుకున్నార‌ని యాంగ్రీ హీరో రాజశేఖర్ అన్నారు. రాజ‌శేఖ‌ర్ కథానాయకుడుగా నటించిన చిత్రం శేఖర్ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ నటించారు. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించారు. అయితే ఈ సినిమాను నిలిపివేయాల‌ని కోర్టు తెల‌ప‌డంతో.. రాజశేఖర్ దీనిపై స్పందించారు. తన శేఖర్ చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేసి, చిత్ర ప్రదర్శనలు నిలిపివేయించారని ఆరోపించారు. సినిమాయే తమకు లోకమని, ముఖ్యంగా ఈ శేఖర్ చిత్రంపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేం ఎంతో కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు…. ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను అని రాజ‌శేఖ‌ర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement