Thursday, April 25, 2024

కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం

శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడులో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. చిన్ని, ఓబులేసు అనే మహిళను, వ్యక్తినీ దుండగులు దారుణంగా నరికి చంపారు.అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు. వెలుగోడులో నివాసం ఉంటున్నారు. మల్లికార్జున దగ్గర ఓబులేసు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఓబులేసు కూడా మల్లికార్జునతో అతని ఇంట్లోనే ఉండేవాడు. అయితే, ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఓబులేసు, మల్లికార్జున రెండవ భార్య చిన్ని లను కిరాతకంగా హత్య చేశారు. మల్లికార్జున తండ్రి ఈ హత్యలకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లికార్జున తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యలకు అక్రమ సంబంధం కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరీ మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తుచేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement