Saturday, April 20, 2024

ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా ముఖేశ్ కుమార్ మీనా నియామ‌కం

ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీసర్​ ముఖేశ్ కుమార్ మీనా నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం శుక్ర‌వారం సాయంత్రం ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టిదాకా ఈ ప‌ద‌విలో మ‌రో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి విజ‌యానంద్ కొన‌సాగుతున్నారు. తాజాగా విజ‌యానంద్ స్థానంలో ముఖేశ్ కుమార్ మీనాను ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా నియ‌మిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముఖేశ్ కుమార్ మీనా ఉమ్మ‌డి రాష్ట్ర కేడ‌ర్‌ను ఎంచుకున్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆయ‌న ఏపీ కేడ‌ర్‌కు ఆప్ష‌న్ ఇవ్వ‌గా… ఆ మేర‌కే బ‌దిలీ అయ్యారు. మొన్నటిదాకా ఏపీ వాణిజ్య ప‌న్నుల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా పనిచేసిన ఆయన ఇటీవలే గవర్నర్ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌తో త్వ‌ర‌లోనే మీనా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement