Thursday, April 25, 2024

సీఎం జగన్ కు రఘురామ మరో లేఖ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. పరీక్షలను రద్దు చేయాలని కోరారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షల రద్దుపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా బోర్డు పరీక్షలు రద్దు చేశాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా టైంలో పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఉందని మండిపడ్డారు. విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా తక్షణమే పరీక్షలు రద్దుపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో రఘురామ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: మాజీ ప్రధానికి షాక్.. పరువు నష్టం కేసులో భారీ జరిమానా

Advertisement

తాజా వార్తలు

Advertisement