Monday, April 15, 2024

పోలవరంలో అక్రమాలు.. కేంద్ర జలశక్తిశాఖ మంత్రికి రఘురామ ఫిర్యాదు

పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయాంటూ కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని రఘురామ ఆరోపించారు. లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అదనపు నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేటాయింపులు పెంచి 25శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ కి రఘురామ తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణలో మరో పది రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు.. సడలింపు సమయం ఇవే!

Advertisement

తాజా వార్తలు

Advertisement