Thursday, April 18, 2024

ఉమా ప్రాణాలకు ముప్పు: రఘురామ

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కారులో కూర్చున్న దేవినేని ఉమ దాడులు ఎలా చేస్తాడని ఆయన ప్రశ్నించారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఉమా ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తున్నానని తెలిపారు. రాజమండ్రి జైలు అధికారిని మార్చడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. దేవినేని ఉమాను ఉంచిన రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ లింక్ ను మేజిస్ట్రేట్ కు ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిడితో అన్యాయంగా కేసులు పెట్టే పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement