Friday, March 29, 2024

రఘురామ విడుదల ఆలస్యం!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిలుపై సోమ‌వారం విడుద‌ల‌య్యే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. రఘురామకు నిన్న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, కోర్టు ఆదేశాలు ఎంపీ న్యాయవాదుల‌కు ఇంకా అంద‌ని నేప‌థ్యంలో ఆయ‌న‌ విడుద‌ల ఆల‌స్యం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇవాళే.. రఘురామ విడుదలవుతారని అంతా అనుకున్నా.. ప్రక్రియలో ఆలస్యంతో సోమవారం విడుదల అయ్యే అవకాశాలు ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎంపీ తరపు న్యాయవాదులు కింది కోర్టులో సోమవారం పూచీకత్తును సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రఘురామ‌ రూ.లక్ష వ్యక్తిగత బాండు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతం ఆయ‌న సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుప‌త్రిలోనే ఉన్నారు. విడుద‌లైన త‌ర్వాత కూడా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఈ కేసుకు సంబంధించిన అంశాలపై  మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని కోర్టు ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని షరతులు విధించింది. ఒకవేళ ర‌ఘురామ వీటిని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement