Thursday, April 25, 2024

డీజీ సునీల్ కుమార్ పై డీసీపీకి RRR ఫిర్యాదు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ పై ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు రఘురామ ఫిర్యాదు చేశారు. మే14న తనను అరెస్ట్ చేసినప్పుడు తన నుంచి ఐఫోన్ తీసుకున్నారని, ఇంతవరకు తిరిగివ్వలేదని తన ఫిర్యాదులో ఆరోపించారు. స్వాధీనం చేసుకున్న ఫోన్ లో 90009 11111 నెంబరుతో వాట్సాప్ ఖాతా ఉందని వివరించారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాలో ఫోన్ ను చేర్చలేదంటూ లీగల్ నోటీసు ఇచ్చానని ఢిల్లీ డీసీపీకి తెలిపారు.

గత నెల 14వ తేదీ రాత్రి సునీల్ కుమార్ సహా నలుగురు తనను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. తర్వాత మరో వ్యక్తి తన ఛాతీపై కూర్చుని ఫోన్ లాక్ తెరవాలని ఒత్తిడి చేశారని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణరక్షణ కోసం ఫోన్ లాక్ ఓపెన్ చేసినట్టు ఫిర్యాదులో వివరించారు. మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌, కుటుంబ సభ్యులకు తన వాట్సాప్‌ నెంబర్‌ నుంచి పలుమార్లు మెసేజ్‌లు పంపారని ఆరోపించారు. ప్రభుత్వ సేవకుడే చట్టాలను ఉల్లంఘించి నేరపూరితంగా వ్యవహరించారని అని అన్నారు. సునీల్‌కుమార్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. 

ఇది కూడా చదవండి: సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు

Advertisement

తాజా వార్తలు

Advertisement