Thursday, April 25, 2024

ఏపీలో 3 వేల దాటిన కొత్త కేసులు..12 మంది మృతి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,309 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా..అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 1,053 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం 18,666 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 31,929 మందికి కరోనా పరీక్షలు చేశారు. చిత్తూరు జిల్లాలో భారీ స్థాయిలో 740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 527, విశాఖ జిల్లాలో 391, కర్నూలు జిల్లాలో 296 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం 97, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 26 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,291కి పెరిగింది. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,21,906కి చేరింది. 8,95,949 మంది కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement