Saturday, April 20, 2024

నెల రోజుల పసికందు అదృశ్యం.. గంటల వ్యవధిలో గుర్తించిన పోలీసులు

నెల్లూరు, ప్రభ న్యూస్ : నెలరోజుల క్రితం జన్మించిన పసికందును కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి అపహరించుకెళ్లాడు. గత కొన్నిరోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో భర్త భార్యను చూసేందుకు ఇటీవల కాలంలో వెళ్లలేదు. సోమవారం బాబును చూసేందుకు వెళ్లిన వంశీకృష్ణ బాబుతో ఆడుకుంటూ భార్యకు చెప్పకుండా బాబును తనతోపాటు తీసుకుని తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత తల్లి కమల భర్త, బాబు కోసం చూడగా.. పరిసర ప్రాంతాల్లో వారి జాడ కనిపించలేదు.

దీంతో బాధితురాలు కమల భోరున విలపిస్తూ చుట్టుపక్కల గాలించింది. అయినప్పటికీ వారి ఆచూకీ తెలియకపోవడంతో జిల్లా ఎస్పీ సీహెచ్‌.విజయరావుకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఎస్పీ కోట పోలీసులను అప్రమత్తం చేసి పసికందును గుర్తించాలని ఆదేశించారు. దీంతో పోలీసులు బాధితురాలి వద్ద పూర్తి వివరాలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టారు. సైదాపురం మండలం తలుపూరు గ్రామంలో తండ్రి వద్ద పసికందు ఉందన్న సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని ఆ పసికందును సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. ఆ చిన్నారి తల్లి, కుటుంబసభ్యులు ఎస్పీ విజయరావుకు ఫోన్‌ ద్వారా జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement