Friday, April 19, 2024

జగన్ ను కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు: మోహన్ బాబు

ఏపీ సీఎం జగన్ పై సీనియర్ నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ బంధువులేనని వెల్లడించారు. గతంలో చంద్రబాబుకు కూడా ప్రచారం చేశానని, జగన్ కు కూడా ఓసారి ప్రచారం చేద్దామన్న ఉద్దేశంతోనే గత ఎన్నికల్లో పార్టీ తరఫున పనిచేశానని వివరించారు. అంతకుతప్పించి తాను మరే ప్రయోజనం ఆశించి జగన్ కు ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు.

సీఎం జగన్ ను కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఘంటాపథంగా చెప్పగలనని మోహన్ బాబు అన్నారు. ఐఏఎస్ అధికారుల్లో కొందరు చంద్రబాబు హయాం నుంచి పనిచేస్తున్నవారు ఉన్నారని తెలిపారు. కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో ఉన్నత విద్యావ్యవస్థల విధానం దెబ్బతిన్నదని ఆరోపించారు. తన విద్యాసంస్థలకు న్యాయంగా నిర్ణయించాల్సిన ఫీజులు నిర్ణయించలేదన్నది వాస్తవం అని మోహన్ బాబు ఉద్ఘాటించారు. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నానని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement