Friday, April 19, 2024

చంద్రబాబు ఏడుపొచ్చింది… రోజాకు నవ్వువచ్చింది!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీట్ లో బోరున ఏడవటం పై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు ఏడవటం తనకు చాలా ఆనందంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు.. ఎన్టీ రామారావును ఏడిపించిన సంగతి ఎవరు మర్చిపోలేదని గుర్తు చేశారు. పైన దేవుడు ఉన్నాడన్న రోజా.. అందుకే చంద్రబాబు చేత నేడు కంటతడి పెట్టించాడని పేర్కొన్నారు. గతంలో వైయస్ విజయమ్మ, వైయస్ భారతిని కూడా చంద్రబాబు ఏడిపించారని చెప్పారు. తనను కూడా చంద్రబాబు… అనేక అవమానాలు చేశాడు అని మండిపడ్డారు. “కర్మ ఫలితం అనుభవించు బాబు, అధికారం చేతిలో ఉందని మహిళలు అని కూడా చూడకుండా నాడు నన్ను, జగనన్న కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురిచేసింది మరిచిపోయావా? నీ దొంగ ఏడుపులు రాష్ట్ర ప్రజలు నమ్మరు బాబు !” అంటూ రోజా మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement