Thursday, March 28, 2024

MLA Roja: కబడ్డీ ఆడిన రోజా.. కూతకు వచ్చి అందర్నీ..

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కబడ్డీ ఆడారు. గతంలో వాలీబాల్ తోపాటు పలు స్పోర్ట్స్ ఆడిన ఆమె.. తాజాగా కబడ్డీతో మరోసారి క్రీడలపై తనకున్న అభిమాన్ని చాటారు. కోర్టులో దిగి జాతీయ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. కూతకు వచ్చి కబడ్డీ కబడ్డీ అంటూ స్టేడియంలో అందర్నీ ఉత్సాహపరిచారు.

తిరుపతిలో జాతీయస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ జరుగుతున్నాయి. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, టీటీడీ ఈఓ కేఎస్‌ జవహర్‌రెడ్డి తిలకించారు. ఎమ్మెల్యే రోజా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో జోష్‌ నింపేందుకు ఆటవిడుపుగా కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ జాతీయ క్రీడలను తిరుపతిలో నిర్వహించడం గర్వకారణమన్నారు. క్రీడలతో ఆర్యోగం, ఆనందం దక్కుతుందని తెలిపారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారని రోజా పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement