Friday, April 19, 2024

Kuppam elections: లోకేష్ వీధి రౌడీలాగా మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిలప్ ఎన్నికలు నేపథ్యంలో టీడీపీ,వైసీపీ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేస్తుంటే.. వైసీపీ నేతలు ఆయనకు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా సెటైరికల్ కామెట్లు చేశారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన ఓ వీధి రౌడీ మాదిరే మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం అభివృద్ధిని పట్టని చంద్రబాబు, లోకేశ్.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. చంద్రబాబు ఏనాడూ కుప్పం అభివృద్ధిని పట్టించుకోలేదని.. కోవిడ్‌ సమయంలోను ప్రజలను గాలికొదిలేశారని మండిపడ్డారు. లోకేశ్ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం నియోజకర్గం ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రోజా అన్నారు. సీఎం వైఎస్ జగన్ అందజేస్తున్న సంక్షేమ పథకాలను చూసి.. అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపిస్తున్నారని చెప్పారు. కుప్పం నియోజక వర్గంలో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని రోజా జోస్యం చెప్పారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ మంత్రులకు ఏపీ సంగతి ఎందుకు?: సజ్జల ఎదురు దాడి

Advertisement

తాజా వార్తలు

Advertisement