Tuesday, April 16, 2024

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి క్రైమ్, జూన్ 1,(ప్రభ న్యూస్): ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇరువురి క్షతగాత్రులను తన కాన్వాయ్ లో హుటాహుటీన ఆసుపత్రికి తరలించి మరోమారు మానవత్వం చాటుకున్నారు. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి చిన కాకాని కి చెందిన ముద్రబోయిన వెంకటకృష్ణ తన ద్విచక్రవాహనంపై మంగళగిరి వస్తుండగా మార్గమధ్యలో ఎన్నారై వై జంక్షన్ వద్ద మంగళగిరి వైపు నుంచి ద్మ గుంటూరు వైపు వెళుతున్న మరొక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు.

దీంతో ద్విచక్ర వాహనం వెనుక కూర్చొని ఉన్న చినకాకానికి చెందిన బి.కుమారితో పాటు మరో ద్విచక్ర వాహనం నడుపుతున్న అదే గ్రామానికి చెందిన ముద్రబోయిన వెంకటకృష్ణ కు గాయాలయ్యాయి. అదే సమయంలో పెదకాకాని తన నివాసానికి వెళుతున్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే తన కాన్వాయ్ ను ఆపి రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం వారిని తన కాన్వాయ్ లో చినకాకాని ఎన్నారై ఆసుపత్రికి తరలించాలని సిబ్బందికి సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని ఎన్నారై వైద్య బృందానికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement