Thursday, April 18, 2024

Breaking: సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు… ఎమ్మెల్యే పిన్నెల్లి బంధువుల మృతి

నాగార్జున సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఏపీ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి కుమారుడు మదన్ మోహన్‌రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఆయన భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష మృతి చెందారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం గొప్పుల సమీపంలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులకు సహాయక చర్యలు చేపట్టారు. కాలువలోని నీటిలో మునిగిన కారును తీసేలోపే మోహన్‌రెడ్డి భార్య, కుమార్తెలు మృతిచెందారు. మోహన్‌రెడ్డికి కూడా తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement