Saturday, April 20, 2024

టిడ్కో ఇళ్ల‌కు తాళాలు .. ఎమ్మెల్యే నిమ్మ‌ల నిర‌స‌న..

ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళకు నాలుగేళ్లుగా తాళాలు ఎందుకు వేసారంటూ ప్లకార్డుతో అసెంబ్లీ వెలుపల నిలువ కాళ్లపై నిలబడి టీడీపీ ఎమ్మెల్యే డా.నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… కట్టిన ఇళ్లకు రంగులు కాదు.. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నాడు ఉచితమని చెప్పి, నేడు టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులను బ్యాంకులకు జగన్ తాకట్టు పెడుతున్నాడన్నారు. నాలుగేళ్లలో ఒక్క అరబస్తా సిమెంట్ వాడకుండా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులపై జగన్ కక్ష సాధిస్తున్నాడని ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement