Thursday, April 25, 2024

దమ్ముంటే రా.. సోమిరెడ్డికి కాకాని సవాల్!

టీడీపీ నేత, మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ సవాల్‌ విసిరారు. ‘దమ్ముంటే రా.. నువ్వో నేనో తేల్చుకుందాం’ అని కాకాని సవాల్ విసిరారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే సోమిరెడ్డి నిరూపించాలని, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.

‘‘ఆయుర్వేదంలో ఆనందయ్యకు ఎంతో అనుభవం ఉంది. కొవిడ్‌ నిబంధనలు పాటించలేదని పంపిణీ నిలిపివేశారు. సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారు. ఆనందయ్య మందు పంపిణీని జిల్లా కలెక్టర్‌ నిలిపివేశారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే.. నేరుగా ఆనందయ్యకే చేయవచ్చు. ప్రభుత్వానికి, వైసీపీకి ఆనందయ్య మందుతో సంబంధం లేదు. అన్ని జిల్లాలకు మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆనందయ్య మందుకు అనుమతుల కోసం ఎంతో కష్టపడ్డాం’’ అని కాకాని గోవర్దన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: లక్షా యనభై వేలకు ఇల్లు నిర్మాణం సాధ్యమా?

Advertisement

తాజా వార్తలు

Advertisement