Thursday, April 25, 2024

సమతా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం.. సాంకేతిక లోపంతో విడిపోయిన ఇంజిన్‌

సీతానగరం(విజయనగరం),ప్రభ న్యూస్‌: విజయనగరం జిల్లా సీతానగరం మండలం సీతానగరం రైల్వే స్టేషన్‌ పరిధిలో గుచ్చిమీ రైల్వే గేట్‌ సమీపంలో బుధ వారం విశాఖపట్నం నుండి నిజాముద్దీన్‌ వెళ్తున్న సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో బోగీల నుండి ఇంజన్‌ విడిపోయి సుమారు కిలో మీటరు వరకు వెళ్ళి పోయింది. ఇది గమనించిన లోకో పైలెట్‌ అప్రమత్తమై వైర్లెస్‌లో డ్రైవర్‌కు సమాచారం ఇచ్చి వెనక్కి రప్పించి బోగీలకు ఇంజన్‌ లింక్‌ చేసి పంపించడం జరిగింది. ఈ సంఘ టనలో సుమారు గంటసేపు రైలు నిలిచిపోయింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement