Tuesday, April 23, 2024

Breaking: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు నిప్పు పెట్టిన దుండ‌గులు.. మంట‌లంటుకుని బుక్స్‌, సామ‌గ్రి ద‌గ్ధం

నెల్లూరు (ప్ర‌భ న్యూస్‌): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలో ఘోరం జ‌రిగింది. మ‌ర్రిపాడు మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో దారుణం జ‌రిగింది. గుర్తు తెలియ‌న వ్య‌క్తులు ఇవ్వాల సాయంత్రం స్కూల్‌కి నిప్పు పెట్టారు. దీంతో పాఠ‌శాల‌లోని విద్యార్థుల సామ‌గ్రి, పుస్త‌కాలు చాలామ‌టుకు అగ్నికి ఆహుత‌య్యాయి. మంట‌ల‌ను గ‌మ‌నించిన స్వీప‌ర్ త‌లుపుల తాళాలు ప‌గ‌ల‌గొట్టి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement