ములకలచెరువు, ప్రభ న్యూస్: మైనర్ బాలికపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది సత్యసాయి జిల్లా ములకలచెరువు మండలంలో జరిగింది. కాగా, అత్యాచారానికి పాల్పడిన యువకుడిని పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలానికి చెందిన లక్ష్మీదేవి కుమారుడు చరణ్ (22) తో కలిసి ములకలచెరువు నల్లగుట్టలో నివాసముంటున్నారు. చరణ్ స్థానిక టమోటా మండిలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి సమీపంలో ఉన్న ఒక మైనర్ బాలిక (17)తో పరిచయం పెంచుకున్నాడు. ఆతర్వాత మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చెప్పిన మాట వినకపోతే కుటుంబ సభ్యులకు చెబుతానంటూ బెదిరించేవాడు. ఏడాది కాలం పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. గత నెల 31న బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు.
దీంతో బాలిక తల్లి ఈనెల రెండో తేదీన తన కుమార్తె అదృశ్యమైనట్లు ములకలచెరువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలిక అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 6న అదృశ్యమైన బాలిక హిందూపురంలో ఉన్నట్లు ఆచూకీ లభ్యమైంది. అదృశ్యమైన బాలిక ను పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చి విచారించడంతో ఏడాదిపాటు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. మదనపల్లి డిఎస్పి రవి మనోహరా చారి మరియు ఎస్ఐ డి. వై. స్వామి తో కలిసి బుధవారం స్థానిక నల్లగుట్ట లోని బాలిక తల్లిదండ్రుల ను స్థానికులను విచారించారు. నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చర్య తీసుకుంటామని న్యూస్ కి తెలిపారు.