Friday, April 19, 2024

పర్యాటక రంగం అభివృద్దికి సత్వర చర్యలు: మంత్రి రోజా

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి, క్రీడలను, క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు సత్వర చర్యలు తీసుకొంటామని మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి రోజా సమావేశం అయ్యారు. ఆయా శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. సాహిత్య అకాడమీ, మ్యూజిక్, డ్యాన్సు అకాడమీ, నాటక అకాడమీ, విజ్యువల్ ఆర్ట్సు అకాడమీ, జానపద కళల అకాడమీ,  హిస్టరీ అకాడమీ, సైన్సు అండ్ టెక్నాలజీ అకాడమీల చైర్ పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొని వారి అకాడమీల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను, కార్యాచరణ ప్రణాళిలను మరింత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం మరింత సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement