Saturday, April 20, 2024

అన్ స్టాపబుల్ షో పై మంత్రి రోజా హాట్ కామెంట్స్ ..!

బాలకృష్ణ‌ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏపీ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఆ షో ఏ రేంజ్ లో సక్సెస్ పొందిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తి చేసుకున్న కూడా ముగింపుకు చేరువయ్యింది. ఇలాంటి సమయంలోనే అన్ స్టాపబుల్ షో పై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ భవాని ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సందడి చేసిన రోజా మీడియా ప్రతినిధులతో మాట్లాడి అన్ స్టాపబుల్ షోకు వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. చాలా ఘాటుగా స్పందించారు.

షో కి వెళ్లే ఉద్దేశం తనకు లేదని.. చంద్రబాబు ఇంటర్వ్యూ చూశాక షో మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ షో కి పవన్ కళ్యాణ్ ను పిలుస్తుండడంతో ఆ షో కి వెళ్లాలని అస్సలు అనిపించడం లేదంటూ రోజా తెలిపారు. ముఖ్యంగా ఈ షోలు కూడా వారు డబ్బు కోసమే చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అందులో వారు చెప్పేవి ప్రజలకు తెలియని నిజాలా? అని కూడా ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement