Monday, March 25, 2024

బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ: మంత్రి పేర్ని నాని ఆదేశం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన మంత్రి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశించారు.  క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. వైద్య సహాయ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులకు మంత్రి పేర్ని నాని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement