Wednesday, April 24, 2024

Breaking: టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి: గుడివాడ క్యాసినోపై మంత్రి కొడాలి

గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రతిపక్ష టీడీపీ నాయకులు తనను టార్గెట్ చేయడంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి చేశారని మండిపడ్డారు. తనను ఓడించలేకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 3 రోజుల క్యాసినోకు రూ.500 కోట్లు వస్తే.. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలని మంత్ర కొడాలి నాని ప్రశ్నించారు. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో? అని ఎద్దేవా చేశారు. గుడివాడ ప్రజలకు అన్ని తెలుసన్న నాని.. 3 రోజుల క్యాసినోకు 362రోజులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవాలని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement