Tuesday, April 23, 2024

పవన్ కల్యాణ్ పై మండిపడ్డ మంత్రి జోగి రమేశ్

ఏపీ మంత్రి జోగి రమేశ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. తాము ఇచ్చిన లే అవుట్ లో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా అంటూ మండిపడ్డారు. సిగ్గులేదా పవన్ కల్యాణ్ అని విరుచుకుపడ్డారు. 2014-19 దాకా ప్రజలకు ఒక్క సెంట్ స్థలం కూడా ఇవ్వలేకపోయారన్న ఆయన. గతంలో చంద్రబాబును చొక్కా పట్టుకుని ఎందుకు అడగలేదని మండిపడ్డారు. దుర్మార్గంగా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు పవన్ కు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే మీకు ఎందుకు కడుపు మంట పవన్ కల్యాణ్ అని మంత్రి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement