ఒక రోజు పర్యటన నిమిత్తం ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఉదయం 9.30గం.లకు సుష్మాస్వరాజ్ భవన్ లో విమానయాన రంగ అభివృద్ధిపై జరిగే సమావేశానికి మంత్రి మేకపాటి హాజరువుతారు. కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సిండియా నేతృత్వంలో జరగనున్న సమావేశంలో అన్ని రాష్ట్రాల మంత్రులు పాల్గొననున్నారు. సాయంత్రం 4గం.లకు ఎలక్ట్రానిక్ నికేతన్,సీజీఓ కాంప్లెక్స్ లో కేంద్ర ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో మంత్రి మేకపాటి సమావేశం కానున్నారు.
కాగా, ఈ సమావేశంలో ఏపీఏడీసీ ఎండీ వీ.ఎన్.భరత్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, తదితరులు పాల్గొననున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..