Sunday, March 24, 2024

అజ్ఞాన చీకట్లు తొలగించే..విజ్ఞాన దీపాల తేజోత్సవం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దీపాళవి శుభాకాంక్షలు తెలిపారు. ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..ఒకొక్క అడుగు ముందుకు వేసి  ప్రతి ఒక్కరూ గొప్ప జీవితాన్ని సాధించుకోవాలని అన్నారు. దీపావళి.. అంటే చెడుపై మంచి సాధించినందుకు విజయకేతనం అని చెప్పారు. అవనికంతా ఆనంద విజయోత్సాహం.. అజ్ఞానపు చీకట్లు తొలగించే.. విజ్ఞాన దీపాల తేజోత్సవంగా ఆయన అభివర్ణించారు. అంతరంగంలో అంధకారాన్ని అంతం చేసి  తమను తాము వ్యక్తిత్వం వెలుగులీనేలా తీర్చిదిద్దుకోవాలని మంత్రి మేకపాటి ఆకాంక్షించారు. పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో ఆనందంగా, ఆరోగ్యంగా దీపావళి పండగ సంబరాలు జరుపుకోవాలని మంత్రి గౌతమ్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement