Thursday, April 18, 2024

చంద్రబాబుకు మంత్రి బొత్స సవాల్

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ఆదివారం విజయనగరంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన వైసీపీ నాయకుల సమావేశంలో బొత్స మాట్లాడారు. గతంలో సమ్మిట్ లు నిర్వహించారని, అయితే మరెవ్వరూ నిర్వహించనట్లుగా వాటి గురించి ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారని అన్నారు. ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదని, తమలా చేసి చూపించాలని అన్నారు. విశాఖలో చాలా క్రమశిక్షణతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను సీఎం జగన్ నిర్వహించారని ఆయన చెప్పారు. దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని, హుందాగా ఎంవోయూలు చేసుకున్నారని తెలిపారు. తన అధ్యక్షతనే కమిటీ వేసి, నిరంతరం పర్యవేక్షిస్తానని సీఎం చెప్పారని తెలిపారు. కేవలం ఒప్పందాలు ముఖ్యం కాదని, వాటి గ్రౌండింగ్ కూడా ముఖ్యమనేది జగన్ ఆలోచన అని బొత్స సత్యనారాయణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement