Thursday, April 18, 2024

బీఆర్ఎస్ పార్టీపై స్పందించిన మంత్రి బొత్స‌..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు ఏపీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వచ్చే ఏడాది జనవరిలో విజయవాడలో కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. ఏపీలో ఉన్న వివిధ పార్టీల మాదిరే బీఆర్ఎస్ కూడా ఒక పార్టీగా ఉంటుంద‌న్నారు. ఏపీలో ఎన్ని పార్టీలు ఉంటే వైసీపీకి అంత మంచిదని అన్నారు. ఎన్ని పార్టీలు ఉన్నా వైసీపీ సంక్షేమ ప‌థ‌కాలే మాకు బ‌లం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement