Saturday, April 20, 2024

Flash: 26 జిల్లాలు వస్తున్నట్టే.. 3 రాజధానులొస్తాయి: మంత్రి అవంతి కీలక వ్యాఖ్య

ఏపీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 26 కొత్త జిల్లాలు ఎలా వస్తున్నాయో, మూడు రాజధానులు కూడా అలానే వస్తాయని ఆయన అన్నారు. జిల్లాల పునర్విభజన చరిత్రాత్మకమన్న మంత్రి అవంతి.. జిల్లాలను విభజించడం వల్ల కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. భీమిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

జిల్లాల పునర్విభజనపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా విభజించి అధికార వికేంద్రీకరణ చేశారని గుర్తు చేశారు. జిల్లాల పునర్విభజనకు ఒక్క చంద్రబాబునాయుడు తప్ప అందరూ అనుకూలంగానే ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ సైతం జిల్లాల విభజనను స్వాగతించిందని చెప్పారు. ఒక్క చంద్రబాబు తప్పా అంతా అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందాలని భావించడం సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement