Saturday, April 20, 2024

తుపాన్ తగ్గేవరకు బయటకు రావొద్దు: ప్రజలకు మంత్రి సూచన

శ్రీకాకుళంలోని జవాద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు పర్యటించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రభావిత ప్రాంతాలలో శనివారం మంత్రి అప్పల రాజు పరిశీలించారు. పలాస మున్సిపాలిటీ ప్రధాన రహదారిపై పేరుకుపోయిన చెత్తను తొలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది సహాయంతో పూడికలు తొలిగించి, జేసిబిలతో డ్రైనేజీ అడ్డంకులు తొలిగించారు. అనంతరం పలాస మండలం బ్రహ్మణతర్ల, అమలకుడియా ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటపోలాలను పరిశిలించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రజలు ఎవరూ తుఫాన్ తీవ్రత తగ్గేవరకు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement