Tuesday, April 16, 2024

నిజాలు చెప్పే ధైర్యం ఉందా: టీడీపీ నేతలకు మంత్రి అనిల్ సవాల్

టీడీపీ నేతలపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తీవ్రం ఫైర్ అయ్యారు. పోలవరంపై టీడీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన దేవినేని ఉమా చేతులెత్తేశాడని, అతనిపై ఎందుకు ట్రోల్ చెయ్యరని ప్రశ్నించారు. పోలవరం ఎందుకు ఆలస్యం అయ్యిందో మీకు తెలియదా? అని ప్రశ్నించారు. డయా ఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యత లోపం వాస్తవం కాదా? అని నిలదీశారు.

పోలవరంపై నెటిజన్లు ఎవరూ ట్రోల్ చేయడం లేదని, అంతా టీడీపీ నేతలే చేస్తున్నారని మంత్రి అనిల్ ఆరోపించారు. టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. దమ్ముంటే వాస్తవాలు ట్రోల్‌ చేయాలని మంత్రి అనిల్ సవాల్‌ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement