Thursday, April 25, 2024

విద్యార్థులకు అస్వస్థతపై మంత్రి కీలక ఆదేశాలు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరా తీసారు. అధికారులతో మాట్లాడిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో  14 మంది విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతో అస్వస్థతకు గురైనట్టు అధికారులు మంత్రికి వివరించారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల అస్వస్థతపై నివేదిక కోరారు. వైద్య సేవల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement