Thursday, April 25, 2024

Vizag: బాక్సైట్ త‌వ్వ‌కాలు ఆపాలంటూ మావోయిస్టుల లేఖ

బాక్సైట్ త‌వ్వ‌కాలు ఆపాలంటూ మావోయిస్టులు లేఖ రాశారు. ఏవోబీ జోన‌ల్ క‌మిటీ గ‌ణేష్ పేరుతో లేఖ విడుద‌ల చేశారు. అన్ రాక్ తో ప్ర‌భుత్వ ఒప్పందాలు ర‌ద్దు చేసుకోవాల‌ని, పాత విశాఖ మ‌న్యాన్ని ప‌ర్యాట‌క కేంద్రంగా చేయొద్ద‌ని లేఖ‌లో తెలిపారు. ప్ర‌జ‌లు స్వాధీనం చేసుకున్న కాఫీ తోట‌ల‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌న్నారు. కాఫీ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌భుత్వ‌మే కొనాల‌ని, ఆదివాసీల‌పై అక్ర‌మ కేసులు ఎత్తివేయాల‌ని మావోయిస్టులు లేఖ‌లో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement