Friday, April 19, 2024

Accident: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. శావల్యాపురంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులకు.. క్షతగాత్రుడిని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి శావల్యాపురానికి చెందిన పూజారి తురిమెల్ల భాస్కర్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement