Thursday, April 25, 2024

తల్లితో సహజీవనం..కూతురిని పెళ్ళి చేసుకుంటానని వేధింపులు..

భర్త నుంచి దూరంగా ఉంటుంది ఓ మహిళతో సహజీవనం చేస్తూ చివరికి.. ఆ మహిళ కూతురు పైనే కన్నేసాడు ఓ దుర్మార్గుడు. అంతే కాదు పెళ్ళి కి ఒప్పుకోకపోవడంతో చిత్రహింసలకు గురిచేశాడు. గుంటూరు జిల్లా మంగళగిరి లో చోటుచేసుకుంది ఘటన. భర్త నుండి దూరంగా ఉంటుంది మహిళతో సాంబశివ రావు అనే వ్యక్తి..ఆమెతో మంచిగా ఉంటూ సహజీవనం మొదలుపెట్టాడు. ఆమెకు డిగ్రీ పూర్తి చేసుకున్న కూతురు ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి కన్ను ఆ యువతి పై పడింది. కూతురికి పెళ్లి చేయాలనీ అనుకుంటున్నా సమయంలో..సాంభశివరావు..కూతురిలా చేసుకోవాల్సిన యువతీ ని పెళ్లి చేసుకుంటున్నాని చెప్పి షాక్ ఇచ్చాడు. దీనికి ఆ తల్లి తిరస్కరించింది.

దీంతో ఆగ్రహానికి గురైన సాంబశివరావు తల్లీకుమార్తెలను వారం రోజులుగా ఇంట్లోనే ఉంచి చిత్రహింసలు పెడుతున్నాడు. బుధవారం యువతిని బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. అతడి చిత్రహింసలు భరించలేకపోయిన తల్లీకూతుళ్లు ఇంటి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్!

Advertisement

తాజా వార్తలు

Advertisement