Friday, March 29, 2024

తుంగభద్ర నదిలో వ్యక్తి గల్లంతు.. గాలింపు చేప‌ట్టిన పోలీసులు

నందవరం (ప్రభన్యూస్) : క‌ర్నూలు జిల్లా నంద‌వ‌రం మండల పరిధిలోని తుంగభద్ర నదిలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదివారం నాగలదిన్నె బ్రిడ్జ్ వద్ద ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు తెలంగాణకు సొంత పని మీద వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వీరిలో జానకి రాముడు, కురువ ఆంజనేయులు, బోయ శీను, బోయ వీరేష్, ఈడిగ రాముడు బ్రిడ్జ్ పై నుండి నడచుకొని రాగ మరో ఇద్దరు కురువ సురేష్, బోయ నాగరాజు బ్రిడ్జ్ కింద నుండి తుంగభద్ర నదిలో నీళ్లలో దాటుకుంటూ వ‌చ్చారు. ఈక్ర‌మంలో కురువ సురేష్ నీటి ఉధ్రితికి మునిగిపోయి కొట్టుకొని పోయినాడు. బోయ నాగారాజు సురక్షితంగా బయట పడ్డాడు. కురువ సురేష్ కోసం నందవరం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement