Friday, March 29, 2024

కర్నూలులో విషాదం.. పాము కాటుతో యువకుడు మృతి

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అవుకు గ్రామానికి చెందిన శ్రీకాంత్(28) అనే వ్యక్తి పాముకాటుతో మృతి చెందాడు. శ్రీకాంత్ 108 అంబులెన్స్ లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా కర్నూలు నుండి తిరిగి వస్తుండగా నన్నూరు(తాండ్రపాడు) వద్ద అంబులెన్స్ అపి.. కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లాడు. అయితే, అక్కడ పాముకాటుకు గురైయ్యాడు. దీంతో శ్రీకాంత్ ను చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ..

Advertisement

తాజా వార్తలు

Advertisement