Thursday, April 18, 2024

తిరుచానూరులో వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి సిటీ, ఏప్రిల్ 19 (ప్రభ న్యూస్): తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహాల్లోని 21వ బ్లాక్ లో నివాసముంటున్న నిరంజన్ (35). బుధవారం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందడం జరిగింది. కుటుంబ సభ్యులు తిరుచానూరు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. ఉరివేసుకొని మృతిచెందినట్లు గుర్తించారు. ఇతను తిరుమలలో వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. ఇతనికి భార్యతో సహా ముగ్గురు పిల్లలున్నారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించినట్లు తిరుచానూరు పోలీసులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement