Tuesday, March 26, 2024

పిచ్చి కుక్క స్వైర విహారం.. 13 మందికి తీవ్ర గాయాలు..

కలువాయి (ప్రభ న్యూస్) : నెల్లూరు జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తోంది. క‌లువాయి మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 13 మందిపై దాడి చేసింది. కుక్క దాడిలో గాయపడ్డ వారికి ప్రథ‌మ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు, ఆత్మకూరు ప్రభుత్వ ఆస్ప‌త్రుల‌కు తరలించారు. కలువాయి, చీపినాపి, ఉయ్యలపల్లి, ఎర్రబల్లి, కోటూరుపల్లి గ్రామాల్లో పిచ్చికుక్క తిరుగుతోంది. గ్రామంలో ఆడుకుంటున్న 11మంది పిల్లలను వేరు వేరు చోట్ల కరిచి గాయపరిచింది.

దాడిలో గాయపడిన వారిని కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికీ తీసుకొచ్చి చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు, ఆత్మకూరు ఆసుపత్రులకు తరలించారు. గత నెలలో ఇదే విధంగా మండల కేంద్రంలో ఓ పిచ్చి కుక్క 15 మందిపై దాడి చేసింది. అది మరువక ముందే మరో ఘటన జరగడంతో మండల వాసులు భయాందోళన చెందుతున్నారు. ఉన్నతధికారులు స్పందించి కుక్కల దాడి నుండి ప్రజలను కాపాడాలని వేడుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement