Friday, April 19, 2024

లారీ బీభత్సం.. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి

లారీ బీభత్సం సృష్టించడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సామర్లకోట మండలంలో లారీ బీభత్సం సృష్టించింది. పెదబ్రహ్మదేవంలో పాదచారులపైకి దూసుకెళ్లింది. అనంతరం కెనాల్ లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement