Saturday, April 20, 2024

Breaking: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

బైక్‌ను లారీ కొట్టిన ఘ‌ట‌న‌ అన్న‌మ‌య్య జిల్లాలో ఇవ్వాల (సోమ‌వారం) సాయంత్రం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. కురబలకోట మండలం మదనపల్లి- రాయచోటి ప్రధాన రహదారిలోని తానా మిట్ట వద్ద ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. లారీ ముందు భాగంలోకి బైక్ చొచ్చుకుపోవ‌డంతో బైక్ నుజ్జు నుజ్జ‌య్యింది. మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. ప్ర‌మాద స్థ‌లం అంతా ర‌క్తంతో ఎర్ర‌బారింది. మృతులు తంబళ్లపల్లి మండలం ఎద్దుల వారి పల్లికి చెందిన వారిగా గుర్తించారు. కాగా, సంఘటనా స్థలానికి ముదివేడు పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను మదనపల్లి ప్రభుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి త‌దుప‌రి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్టు ముదివేడు ఎస్ ఐ సుకుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement